‘వెల్లువచ్చి గోదారమ్మ’.. మళ్లీ ఇలా వచ్చిందమ్మా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. కాగా ఈ మూవీ కోసం మరో క్లాసిక్ పాటను రీమేక్ చేయించాడు దర్శకుడు హరీష్ శంకర్. శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన దేవత చిత్రంలోని వెల్లువచ్చి గోదారమ్మ […]

‘వెల్లువచ్చి గోదారమ్మ’.. మళ్లీ ఇలా వచ్చిందమ్మా..
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 12:29 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీశ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. కాగా ఈ మూవీ కోసం మరో క్లాసిక్ పాటను రీమేక్ చేయించాడు దర్శకుడు హరీష్ శంకర్. శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన దేవత చిత్రంలోని వెల్లువచ్చి గోదారమ్మ పాట ఇప్పుడు వాల్మీకిలోనూ ఉండబోతుంది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే మధ్య ఈ సాంగ్‌ను తెరకెక్కించగా.. దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఒరిజనల్ పాటకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఈ పాట ఉండబోతున్నట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ పాటలో పూజా హెగ్డే కూడా తన అందాలతో అదరగొడుతోంది. మొత్తానికి సినిమాకు ఈ రీమేక్ పాట అదనపు ఆకర్షణ అవుతుందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ నటుడు అథర్వ మురళి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన సరసన మృణాళిని రవి కనిపించనుంది. వరుణ్ తేజ్ విలన్‌గా నటించాడు. 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న వాల్మీకిపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ఎఫ్ 2తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్.. వాల్మీకితో రెండో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మరి మొత్తానికి వాల్మీకి ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.