AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు, వెంకీ, నాగ్‌తో ‘బడా’ మల్టీస్టారర్‌.. కథ రెడీ అవుతుందా..!

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ చిత్రాలపై అటు ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. దీంతో మల్టీస్టారర్‌ చిత్రాలను తీసేందుకు దర్శకనిర్మాతలు సైతం చాలా ఆసక్తిని చూపుతున్నారు

చిరు, వెంకీ, నాగ్‌తో 'బడా' మల్టీస్టారర్‌.. కథ రెడీ అవుతుందా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2020 | 8:01 PM

Share

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ చిత్రాలపై అటు ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. దీంతో మల్టీస్టారర్‌ చిత్రాలను తీసేందుకు దర్శకనిర్మాతలు సైతం చాలా ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో బడా మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతన్నట్లు తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ ముగ్గురితో సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

అయితే ఈ ప్రయత్నం ఇప్పటిది కాదు. గతంలో ఈ ముగ్గురితో ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించాలనుకున్నారట రాఘవేంద్రరావు. అందుకోసం ‘త్రివేణి సంగమం’ అనే టైటిల్‌ను కూడా ఆయన అనుకున్నారట. తన 100వ చిత్రంగా దీన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారట. అంతేకాదు ఈ మూవీకి తన కుమారుడు ప్రకాష్‌ కోవెలమూడిని దర్శకుడిగా పెట్టి ఆయన నిర్మించాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వలన ఈ మల్టీస్టారర్‌ కుదరకపోగా.. తన వందో చిత్రంగా అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేస్తూ గంగోత్రిని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ముగ్గురితో మల్టీస్టారర్ తీయాలని భావిస్తోన్న రాఘవేంద్రరావు కథను తయారు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగులో క్రేజీ మల్టీస్టారర్ గా ఇది నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే 2017లో నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు ఆ తరువాత మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు.

Read This Story Also: సాహస ఎస్సై కోలుకున్నారు.. సీఎంవో ప్రకటన..!