Vishwambhara:మెగాస్టార్ సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. త్రిషకు పోటీగా ఆ బ్యూటీ కూడా.?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. చివరిగా చిరంజీవి భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో విశ్వంభర సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 156వ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు విశ్వంభర అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ సోషియో-ఫాంటసీ జానర్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా. ఈ చిత్రానికి “బింబిసార” ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి, కీరవాణి కాంబోలో వస్తున్న నాల్గవ చిత్రం ఇది . సినిమాటోగ్రఫీని ఛోటా కె. నాయుడు హ్యాండిల్ చేస్తుండగా, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్లను రామ్-లక్ష్మణ్ బృందం రూపొందిస్తోంది.
విశ్వంభర అనే టైటిల్ 2024 సంక్రాంతి సందర్భంగా ఒక కాన్సెప్ట్ వీడియోతో అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో ఒక శక్తివంతమైన వస్తువు విశ్వంలో ప్రయాణించి భూమిపైకి చేరుకోవడం చూపించారు. ఈ సినిమా మైథలాజికల్, ఫాంటసీ అంశాలతో కూడిన కథతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. మెగాస్టార్ ఈ సినిమాలో డ్యూయల్ షేడ్స్లో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక హీరోయిన్గా త్రిష కృష్ణన్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించవచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఇతర ముఖ్య పాత్రల్లో మీనాక్షి చౌదరి, సురభి, హర్షవర్ధన్ వంటి నటులు కనిపించనున్నారని తెలుస్తోంది. షూటింగ్ 2023 అక్టోబర్ 23న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో మొదలైంది. ఈ సినిమా కోసం 13 విభిన్న సెట్లు వేశారని తెలుస్తుంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ గ్రాఫిక్స్ మరియు VFX పనుల కారణంగా ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్కు కొంత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ముందుగా విడుదల తేదీని జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా ఖరారు చేశారు. అయితే VFX పనుల ఆలస్యం వల్ల ఆగస్టు 2025 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. గ్రాఫిక్స్ , VFX కోసం సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ హక్కులు సరిగమ సంస్థ 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుందని టాక్ ఈ మధ్య వినిపించింది. ఆమె ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ విశ్వంభర సినిమాలో ఆమె నటించడం లేదని తెలుస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..