కశ్మీర్‌లో మహేశ్ క్రికెట్ మ్యాచ్: వీడియో వైరల్

|

Aug 11, 2019 | 3:30 AM

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు. కశ్మీర్‌ షెడ్యూల్‌ ఇటీవల పూర్తయింది. అక్కడ టీం ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.  బ్రేక్ టైమ్‌లో అందరూ కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు.  మహేశ్‌బాబుతోపాటు ఆయన కుమారుడు గౌతమ్‌, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి క్రికెట్‌ ఆడిన వీడియోను దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. మహేశ్‌, గౌతమ్‌, వంశీ, మెహర్‌ రమేశ్‌తో సరదాగా గడిపినట్లు పేర్కొన్నారు. ‘గౌతమ్‌ నన్ను అవుట్‌ చేశాడు’ అంటూ ఏడుస్తున్న […]

కశ్మీర్‌లో మహేశ్ క్రికెట్ మ్యాచ్: వీడియో వైరల్
Follow us on

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు. కశ్మీర్‌ షెడ్యూల్‌ ఇటీవల పూర్తయింది. అక్కడ టీం ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.  బ్రేక్ టైమ్‌లో అందరూ కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు.  మహేశ్‌బాబుతోపాటు ఆయన కుమారుడు గౌతమ్‌, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి క్రికెట్‌ ఆడిన వీడియోను దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. మహేశ్‌, గౌతమ్‌, వంశీ, మెహర్‌ రమేశ్‌తో సరదాగా గడిపినట్లు పేర్కొన్నారు. ‘గౌతమ్‌ నన్ను అవుట్‌ చేశాడు’ అంటూ ఏడుస్తున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రష్మిక మందనా హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, నరేశ్‌, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.