AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైరెక్ట్ ఓటీటీలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’..!

'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'.. ఈ మ‌ధ్య‌కాలంలో మంచి బ‌జ్ తెచ్చుకున్న చిత్రం. 'బాహుబలి'‌ నిర్మాతలు‌ శోభూ యార్లగడ్డ, ప్ర‌సాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

డైరెక్ట్ ఓటీటీలో 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 12:56 PM

Share

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’.. ఈ మ‌ధ్య‌కాలంలో మంచి బ‌జ్ తెచ్చుకున్న చిత్రం. ‘బాహుబలి’‌ నిర్మాతలు‌ శోభూ యార్లగడ్డ, ప్ర‌సాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేష్‌ మహా తెర‌కెక్కించారు. ఈ సినిమా శుక్రవారం సెన్సార్ కంప్లీట్ చేసుని.. ‘యు’ సర్టిఫికెట్ ద‌క్కించుకుంది. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ ఎండింగ్ లేదా జులై ఆరంభంలో ఇది ఓటీటీలో అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. జాతీయ అవార్డు గ్రహీత బిజిబాల్ ఈ మూవీకి సంగీతం అందిచ‌డం విశేషం.

సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడం గురించి తాజా ఇంటర్వ్యూలో వెంకటేష్‌ మహా త‌న అభిప్రాయాన్ని తెలిపారు. ‘మరో రెండు వారాల్లో మూవీ థియేట‌ర్స్ స్టార్ట్ అయిన్ప్ప‌టికీ.. అది ప్రేక్షకులకు డేంజ‌రే. ఈ విషయంపై నిర్మాత‌ల‌తో చర్చలు జరిగాయి. జీవితం నిమ్మకాయల్ని ఇస్తున్నప్పుడు నిమ్మరసం చేసుకోవడం ఉత్తమం కదా’ అంటూ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వెళ్లాల్సిందే అని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. దీంతో ఇది ఓటీటీలో రిలీజ్ అవ్వ‌డం మాగ్జిమ‌మ్ క‌న్పామ్ అయిన‌ట్టే అని ఫిల్మ్ జనాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Follow Us