లిక్కర్ షాప్ ఓపెన్ చేస్తా.. షాకింగ్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..
తెలంగాణలోని సికింద్రాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ లో ఓ వెలుగు వెలిగింది. 80 కుపైగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించింది. అలాగే పలు అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టి సత్తా చాటింది.

సినిమాలతో పాటు చాలా మంది ముద్దుగుమ్మలు పలు బిజినెస్ ల్లోనూ గట్టిగానే సంపాదిస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే కొంతమంది రకరకాల బిజినెస్ లు కూడా నడిపిస్తున్నారు. కొంతమంది బోటిక్స్, మరికొంతమంది ఇతర బిజినస్ లు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా బిజినస్ మొదలుపెడతా అని తెలిపింది. అంతే కాదు ఆమె చెప్పిన బిజినెస్ ఏంటో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గానూ చేసి పేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు బిగ్ బాస్ హౌస్ లో కూడా సందడి చేసింది ఈ భామ. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..
ఇది కూడా చదవండి : పుష్పలో షెకావత్ పాత్ర నేనే చేయాలి.. కానీ చివరి నిమిషంలో.. అసలు విషయం చెప్పిన హీరో
2011లో సినీరంగంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ నందిని రాయ్. కెరీర్ ఆరంభంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న నందిని రాయ్ తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. కానీ ఈ అమ్మడి అదృష్టం కలిసిరాలేదు. ఇప్పటివరకు ఈ బ్యూటీకి సరైన స్టార్ డమ్ రాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఈ బ్యూటీకి అసలు అవకాశాలే రాలేదు. సినిమాలపరంగా కాకుండా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అలాగే తెలుగు బిగ్ బాస్ లోనూ పాల్గొంది. సినిమాల్లో సరైన హిట్ రాకపోవడంతో ఇప్పుడు ఓటీటీలపై ఫోకస్ చేసింది. పలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. అయినా ఈ బ్యూటీకి ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో మాత్రం స్టార్ డమ్ రాలేదు.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. నెట్టిటం అందాల ఆరబోతతో ఫోటోస్ షేర్ చేస్తూ పాపులారిటీని మరింత పెంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. దాదాపు 15 ఏళ్లకు పైగా సినీరంగంలో కొనసాగుతుంది నందిని రాయ్. తాజాగా నందిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు లిక్కర్ దుకాణం పెట్టాలని ఉంది అని తెలిపింది. నాకు చాలా ఇష్టం.. ఏపీలో నేను టెండర్లు కూడా వేశా.. కానీ రాలేదు. మళ్లీ టెండర్లు వస్తే వేస్తా.. అని తెలిపింది. అలాగే నేను చాలా చేశా.. యానిమల్స్ కోసం కూడా నేను చాలా చేశా అని చెప్పుకొచ్చింది నందిని రాయ్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








