అల్లు అరవింద్, సుకుమార్, మారుతి చేతుల మీదుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘బేబీ’ ప్రారంభం!!

న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న 'బేబీ' చిత్రంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించునున్నారు.

అల్లు అరవింద్, సుకుమార్, మారుతి చేతుల మీదుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీ 'బేబీ' ప్రారంభం!!
Anand
Follow us

| Edited By: Phani CH

Updated on: Oct 15, 2021 | 8:55 AM

న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న ‘బేబీ’ చిత్రంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించునున్నారు. ఈ సందర్బంగా చిత్రం బృందాన్ని అభినందిస్తూ నిర్మాత అల్లు అరవింద్ మొదటి క్లాప్ ఇచ్చారు, సుకుమార్ కెమెరా ఆన్ చేయగా, డైరెక్టర్ మారుతి మొదటి షాట్ డైరెక్ట్ చేసారు. ఈ రోజుల్లో,భలే భలే మగాడివోయ్, మహానుభావుడు,ప్రతి రోజు పండగే లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలలో నిర్మాణ భాగస్వామి గా ఉండి, విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా మూవీ ని సొంతంగా నిర్మించి విజయాన్ని అందుకున్న ఎస్. కె. ఎన్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు.

చిత్ర నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ అధినేతలు ఎస్. కే. ఎన్ & మారుతి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ షూట్ ఈ నెల 20 నుండి ప్రారంభం కానుందని చెప్పారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తుండగా రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.ఈ చిత్రానికి 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే,పుష్ప లాంటి భారీ చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కార్తిక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్