Tollywood: ఎలా ఉండేదానివి ఎలా అయ్యావ్ అమ్మాయ్.. ఇంతకీ మీరు గుర్తుపట్టారా..?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ ఆ చిత్రంలోని మంగమ్మ పాత్ర ద్వారా హరితేజ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు తిరుగులేదు అనుకున్నారు అందరూ. కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. అటు తిరిగి సీరియల్స్వైపు కూడా వెళ్లలేకపోయింది. పెళ్లి చేసుకుని.. పాపకు జన్మనిచ్చింది.

ఈమె ఇంచుమించు మరో సూర్యకాంతంలా పేరు సంపాదిస్తుంది.. నటి హరితేజ గురించి ఈ మాట అన్నది ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. కానీ ఎందుకో తెలీదు కానీ ఆ తర్వాత అంతలా దూసుకెళ్లలేకపోయింది ఈ అమ్మడు. బిగ్ బాస్ సీజన్లో పార్టిసిపెంట్గా వెళ్లి మంచి పేరు సంపాదించింది. అప్పడు థర్డ్ ప్లేసులో నిలిచింది. ఒకప్పుడు బొద్దుగా, ముద్దుగా ఉండేది కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. డైట్ చేసి.. చేసి సన్నజాతి తీగలా అయ్యింది. అయినప్పటికీ అప్పటి లుక్కే బాగుందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. తను మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా. తొలుత టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ, సీరియల్స్లో నటిస్తూ వచ్చింది. మనసు-మమత, ముత్యమంత పసుపు వంటి కొన్ని ప్రముఖ టీవీ సీరియల్స్లో నటించింది. దిక్కులు చూడకు రామయ్య , అందరి బంధువయ, దమ్ము, దువ్వాడ జగన్నాధం, అనగనగా ఓ ధీరుడు , విన్నర్ , అత్తారింటికి దారేది , ఉంగరాల రాంబాబు , రాజా ది గ్రేట్ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. హరి తేజ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో 24 ఫిబ్రవరి 1992న జన్మించింది. ఆమె తండ్రి మఠారీ కాగా, తల్లి కన్నడ రాష్ట్రానికి చెందినవారు. హరితేజ తండ్రి BSNLలో ఉద్యోగి.
దీపక్తో అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న హరితేజ.. 2021లో ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి అటు బుల్లితెరకు, వెండితెరకు దూరంగా ఉంది. త్వరలో మరోసారి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..