AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh- Rajamouli: మహేశ్‌తో దర్శకధీరుడి సినిమా పట్టాలెక్కేది అప్పుడే.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి..

Mahesh Babu: ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ విజయోత్సాహంలో ఉన్నారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajamouli). రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో రూపొందించిన ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రం కలెక్షన్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది

Mahesh- Rajamouli: మహేశ్‌తో దర్శకధీరుడి సినిమా పట్టాలెక్కేది అప్పుడే.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి..
Rajamouli Mahesh
Basha Shek
|

Updated on: Apr 02, 2022 | 8:10 AM

Share

Mahesh Babu: ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ విజయోత్సాహంలో ఉన్నారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajamouli). రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో రూపొందించిన ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రం కలెక్షన్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో ఏ భారతీయ సినిమాకు రాని వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్ఆర్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చాలాసార్లు తన తర్వాతి సినిమా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu)తో ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నిర్మాత కే.ఎల్‌.నారాయణ కూడా మహేశ్‌- రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ క్రేజీ కాంబోపై సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌ను రాజమౌళి ఎలా చూపిస్తారు? కథ ఏమై ఉంటుంది? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కాగా సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో జేమ్స్‌ బాండ్‌ తరహా కథతో ఈ సినిమా రూపొందనుందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెడితే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. మహేశ్‌తో తన సినిమా ఎప్పుడు ప్రారంభించబోతున్నారో ఒక క్లారిటీ ఇచ్చారు.

ఆ సినిమాల తర్వాతే..

‘మహేశ్‌తో సినిమా అంటే కథ పక్కాగా ఉండాలి. అందుకే ప్రీ ప్రొడక్షన్‌కు సుమారు 7 నెలల సమయం పట్టొచ్చు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలో షూటింగ్‌ను పట్టాలెక్కిద్దామనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు ఈ పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అని చెప్పారు. ఇక మహేశ్‌ ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు మహేశ్‌. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఇవి పూర్తయిన తర్వాతే రాజమౌళి సినిమా షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Also Read: Governor Tamilisai: ప్రగతి భవన్- రాజ్ భవన్ మధ్య విబేధాలు.. వచ్చే నెల నుంచి ప్రజాదర్బార్..

Bhadrachalam: నేటి నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం

Paytm: రైలు టికెట్లు బుక్‌ చేసుకోండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. పేటీఎం సరికొత్త ఆప్షన్‌

Follow Us
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!