Chiranjeevi: చిరంజీవి ఇంటికి శివన్న.. స్పెషల్‌ లంచ్‌తో ఆతిథ్యమిచ్చిన మెగాస్టార్.. ఫొటోస్‌ వైరల్

|

Feb 04, 2024 | 5:17 PM

తాజాగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్ మెగాస్టార్‌ను అభినందించారు. బెంగళూరులో నివాసముండే శివన్న హైదరాబాద్‌ కు వచ్చి మరీ చిరంజీవిని కలిశాడు. పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తనను కలిసేందుకు బెంగళూరు నుంచి వచ్చిన శివన్నకు స్పెషల్ లంచ్‌తో ఆతిథ్యమిచ్చారు చిరంజీవి

Chiranjeevi: చిరంజీవి ఇంటికి శివన్న.. స్పెషల్‌ లంచ్‌తో ఆతిథ్యమిచ్చిన మెగాస్టార్.. ఫొటోస్‌ వైరల్
Chiranjeevi, Shiva Rajkumar
Follow us on

సినీ కళామతల్లికి అందించిన సేవలకు గానూ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన అన్నయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, క్రీడా ప్రముఖులు చిరంజీవికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంటికెళ్లి మరీ ఆయనను సత్కరిస్తున్నారు. ఇక ఆదివారం (ఫిబ్రవరి 04) తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌ రెడ్డి చిరంజీవిని ఘనంగా సన్మినించారు. తాజాగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్ మెగాస్టార్‌ను అభినందించారు. బెంగళూరులో నివాసముండే శివన్న హైదరాబాద్‌ కు వచ్చి మరీ చిరంజీవిని కలిశాడు. పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తనను కలిసేందుకు బెంగళూరు నుంచి వచ్చిన శివన్నకు స్పెషల్ లంచ్‌తో ఆతిథ్యమిచ్చారు చిరంజీవి. ఈ మేరకు శివన్నతో కలిసిన ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు మెగాస్టార్ . ‘ నా ప్రియమైన స్నేహితుడు శివన్న నా కోసం ఇక్కడివరకు రావడం చాలా సంతోషం. ఆయన చేసిన పనికి నా మనసు ఉప్పొంగిపోయింది. మేమిద్దరం కలిసి లంచ్‌ చేశాం. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. దివంగత నటుడు రాజ్‌ కుమార్‌తో ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాం. ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు చిరంజీవి.

చిరంజీవి, శివన్నల లంచ్‌ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీరిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదయ్యా అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ కూడా పూర్తి కావొచ్చింది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటింవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రేవంత్ రెడ్డితో చిరంజీవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.