AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam Trailer: ర‌స‌ర‌మ్య దృశ్య కావ్యంగా సమంత శాకుంతలం.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇటీవలే తెలుగులో యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Shaakuntalam Trailer: ర‌స‌ర‌మ్య దృశ్య కావ్యంగా సమంత శాకుంతలం.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
Shakuntalam
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2023 | 12:11 PM

Share

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సామ్. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇటీవలే తెలుగులో యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న మూవీ శాకుంతలం. శాకుంతలం సినిమా హిస్టారికల్ మూవీగా రానుంది. సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం.. దీని ఆధారంగా  భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో ర‌స‌ర‌మ్య దృశ్య కావ్యంగా రూపొందిస్తున్న చిత్రం ‘శాకుతలం’. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.  శాకుంత‌లం కోట్లాదిమంది హృద‌యాల‌ను గెలుచుకున్న శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సమంత మరోసారి తన అందం, అభినయంతో ఆకట్టుకోనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు. మొన్నామధ్య ‘శాకుంతలం’ సినిమా ఫ‌స్ట్ పోస్ట‌ర్ విడుదలై ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ తో సినిమాపై ఉన్న ఆస‌క్తి మ‌రో లెవ‌ల్‌కు చేరుకుంది. అలాగే ఈ మూవీ లో దుర్వాస మునిగా మంచు మోహన్ బాబు.. అల్లు అర్జున్ తనయ అల్లు అర్ష ప్రిన్స్ భారతగా నటిస్తున్నారు.

ముందుగా నవంబర్ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని ప్రకటించారు అయితే ఆ తర్వాత విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా త్రీడీలో ప్రేక్షకులను అలరించనుంది అందుకే ఈ ఆలస్యం అని ఆమధ్య మేకర్స్ వివరించారు.

ఇవి కూడా చదవండి