Sai Pallavi: రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన సాయి పల్లవి.. ఎంత క్యూట్‏గా మాట్లాడిందో చూశారా ?..

న్యాచురల్ బ్యూటీగా క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటన, డ్యాన్స్ లతో సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. తెలుగులో చివరిగా విరాట పర్వం చిత్రంలో కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత తమిళంలో హీరో సూర్య నిర్మించిన గార్గి సినిమాతో హిట్ అందుకుంది. ఈ చిత్రంలో తెలుగులోనూ డబ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత సాయి పల్లవి మరో సినిమాలో కనిపించలేదు.

Sai Pallavi: రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన సాయి పల్లవి.. ఎంత క్యూట్‏గా మాట్లాడిందో చూశారా ?..
Sai Pallavi

Updated on: Dec 09, 2023 | 3:18 PM

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది సాయి పల్లవి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాలను ఫిదా చేసేసింది. ఇందులో వరుణ్ తేజ్ జోడిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత సాయి పల్లవి ఆఫర్స్ క్యూ కట్టినప్పటికీ.. పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ గుర్తింపు సంపాదించుకుంది. న్యాచురల్ బ్యూటీగా క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటన, డ్యాన్స్ లతో సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. తెలుగులో చివరిగా విరాట పర్వం చిత్రంలో కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత తమిళంలో హీరో సూర్య నిర్మించిన గార్గి సినిమాతో హిట్ అందుకుంది. ఈ చిత్రంలో తెలుగులోనూ డబ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత సాయి పల్లవి మరో సినిమాలో కనిపించలేదు.

సంవత్సర కాలంగా సాయి పల్లవ మరో ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో ఆమె సినిమాలు మానేస్తుందనే ప్రచారం నడిచింది. కానీ కొద్ది రోజుల బ్రేక్ అనంతరం కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసింది. కొన్ని నెలల క్రితం ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత తెలుగులో మరో సినిమా చేస్తుంది. అదే తండెల్. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ చందూ మోండేటీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా..ఈరోజు (డిసెంబర్ 9న) ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు హీరోయిన్ సాయి పల్లవి సైతం హజరయ్యింది.

ఎప్పటిలాగే న్యాచురల్ లుక్ లో చుడీదార్ ధరించి మరోసారి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అనంతరం మీడియాతో మాట్లాడింది. “రెండేళ్లు అయిపోయింది మీ ముందుకు వచ్చి.. ఇలా మీ అందర్నీ చూస్తుంటే.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఆశీర్వాదం మాకు.. మా సినిమాకు కావాలి. సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ ఇంకా వస్తుంటాయి. అప్పుడు మరింత మాట్లాడతాను” అంటూ ముగించింది. చాలా కాలం తర్వాత సాయి పల్లవి మీడియాతో ముచ్చంచింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.