AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: కాంతార వివాదం పై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక.. నన్నెవ్వరూ బ్యాన్ చేయలేదు అంటూ ..

రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ వివాదాలపై స్పందించారు రష్మిక.. తనను ఎవ్వరూ బ్యాన్ చేయలేదని.. వ్యక్తిగత విషయాలను కెమెరా ముందు పెట్టలేనంటూ చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna: కాంతార వివాదం పై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక.. నన్నెవ్వరూ బ్యాన్ చేయలేదు అంటూ ..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Dec 09, 2022 | 10:33 AM

Share

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకుంది నేషనల్ క్రష్. ఈ మూవీతో దేశంలోనే కాకుండా ప్రపంవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో అటు దక్షిణాదిలోనే కాకుండా.. బీటౌన్‏లోనూ వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మిక.. ఇటీవల కొద్ది రోజులుగా వివాదాలతో ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్.. ప్రవర్తనతో ఈ ముద్దుగుమ్మను కొందరు తెగ ట్రోల్ చేశారు. సొంత పరిశ్రమను ఆమె మరిచిపోయిందని.. అహంకారి అంటూ ముఖ్యంగా కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ వివాదాలపై స్పందించారు రష్మిక.. తనను ఎవ్వరూ బ్యాన్ చేయలేదని.. వ్యక్తిగత విషయాలను కెమెరా ముందు పెట్టలేనంటూ చెప్పుకొచ్చింది.

గతంలో కాంతార సినిమా విడుదలైన కొత్తలో ఈ మూవీ చూశారా అని ఓ విలేకరి అడగ్గా చూడలేదు అని తెలిపింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కన్నడలో బ్లా్క్ బస్టర్ హిట్.. మీరు ఇంకా చూడలేదా ? అంటూ ట్రోల్ చేశారు. ఇక ఆ తర్వాత పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనను పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ వేళ్లతో చూపించింది. ఇక రష్మిక తీరుపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రిషబ్ శెట్టి సైతం రష్మికకు కౌంటరివ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదం పై స్పందించిన రష్మిక వివరణ ఇచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

“కాంతార సినిమా విడుదలైన కొత్తలో మూవీ చూశారా ? అని అడిగారు.. అప్పటికీ ఇంకా చూడలేదు. కాబట్టి లేదు అని చెప్పాను. ఆ తర్వాత చూసి చిత్రబృందానికి మెసేజ్ పెట్టాను. థాంక్యూ అని రిప్లై కూడా ఇచ్చారు. కానీ బయట ప్రచారం అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. నా జీవితంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలీదు. ఇన్ సైడ్ ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు. నా వ్యక్తిగత జీవితంలో జరిగేది ప్రతిసారి కెమెరా పెట్టి చూపించలేను. ప్రతి మెసేజ్ సోషల్ మీడియా లో పెట్టలేం. నా పర్సనల్ లైఫ్ గురించి జనాలు ఏం మాట్లాడుకున్న నాకు అవసరం లేదు. నా వృత్తికి సంబంధించి ఏం చెప్తున్నారో దాన్ని తీసుకుంటాను. అందుకు తగినట్టు పనిచేస్తాను.వృత్తి పరంగా నేను ఏం చేస్తున్నానో ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం