Pooja Hegde: షూటింగ్‏లో గాయపడిన పూజాహెగ్డే ?.. ఫోటో షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చిన బుట్టబొమ్మ..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలోనూ కనిపించనుంది. ప్రస్తుతం ఈ రెండు సినమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ఈ మూవీ చిత్రీకరణ సమయంలో పూజా హెగ్డే గాయపడినట్లుగా తెలుస్తోంది.

Pooja Hegde: షూటింగ్‏లో గాయపడిన పూజాహెగ్డే  ?.. ఫోటో షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చిన బుట్టబొమ్మ..
Pooja
Follow us

|

Updated on: Oct 20, 2022 | 5:15 PM

చిత్రపరిశ్రమలో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ అమ్మడుకు అవకాశాలు క్యూకడుతున్నాయి. ఈ ఏడాది రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలతో క్షణం తిరిక లేకుండా గడిపేస్తుంది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటిస్తోంది. అలాగే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలోనూ కనిపించనుంది. ప్రస్తుతం ఈ రెండు సినమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ఈ మూవీ చిత్రీకరణ సమయంలో పూజా హెగ్డే గాయపడినట్లుగా తెలుస్తోంది.

ఆమె పాదాలకు పట్టి కట్టి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… లిగ్మెంట్ టియర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాలికి గాయం కావడంతో ఆమె షూటింగ్స్‏కు బ్రేక్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పూజా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పూజా హెగ్డే సినిమా షూటింగ్ సెట్ లో గాయపడిందా ? మరే చోటైనా ప్రమాదం జరిగిందా ? అనేది తెలియాల్సింది ఉంది. ఇవే కాకుండా విజయ్ దేవరకొండ, పూరి కాంబో రాబోతున్న జనగణమన సినిమాలో కూడా నటిస్తోంది.

అలాగే హింందీలో రణవీర్ సింగ్ సరసన ఓ సినిమా చేయనున్నట్లుగా తెలుస్తోంది. మహేష్, త్రివిక్రమ్ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

Pooja Hegde

Pooja Hegde

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.