టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో రాబోతున్న మూవీ జనగణమన. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పూరితో ఇప్పటికే లైగర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు విజయ్. ఖుషి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. అయితే జనగణమన సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.
అయితే మామూలుగానే పూరిజగన్నాథ్ సినిమాల్లో యాక్షన్స్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటాయి. ఇక జనగణమన సినిమా వార్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది దాంతో ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా హీరోకి ధీటుగా ఉంటుందని టాక్. దాంతో పూజాహెగ్డే కోసం.. ఏకంగా థాయ్ లాండ్ నుంచి మార్షల్ ఆర్స్ట్ ట్రైనర్ నే ముంబైకి రప్పిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజాహెగ్డే ఫైట్ సీన్స్ సినిమాకు మరో హైలెట్ గా ఉండనున్నాయట. త్వరలోనే పూజాహెగ్డే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుందని తెలుస్తుంది. ముంబై షెడ్యూల్ తర్వాత అక్కడ నుంచి షూటింగ్ కశ్మీర్ కి షిప్ట్ అవుతుందని సమాచారం.