AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. ఇక మెగా అభిమానులకు పండగే..

ఇందులో పవన్ కళ్యాణ్ తోపాటు.. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇక తర్వలోనే ఈ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టనున్నారని టాక్.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. ఇక మెగా అభిమానులకు పండగే..
Pawan, Sai Dharam Tej
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2023 | 6:50 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుండగా.. డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక వీటితోపాటు..పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం అనే చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తోపాటు.. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇక తర్వలోనే ఈ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టనున్నారని టాక్.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను పవన్ ముందు స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు కేవలం పవన్ కేటాయించింది 25 రోజులు మాత్రమే. 25 రోజులలో అతని పోర్షన్ కంప్లీట్ అయిపోతుందట. అలాగే సుజీత్ తెరకెక్కించే సినిమా కూడా అంతే ఉండబోతుందట. కేవలం నెల రోజుల లోపు కాల్షీట్స్ ఇస్తే సరిపోతుందట. ఆ సినిమాకు కూడా తొందరగా పూర్తి అయిపోతుందని అంటున్నారు. ఇక సముద్రఖని తెరకెక్కించే సినిమా ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14న షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.

ఈ సినిమా ఒరిజినల్ లో సముద్రఖని పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇందులో మరోసారి పవన్ దేవుడిగా కనిపించనున్నారు. గోపాల గోపాల సినిమా తర్వాత రెండోసారి దేవుడి పాత్రలో నటిస్తున్నారు పవన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.