Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను రాముడితో పోల్చిన నిహారిక.. యుద్ధం గెలిచారు అంటూ..

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ మీదకు అడుగు పెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత నిహారిక హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. ఆతర్వాత నాన్న కూచి అనే వెబ్ సిరీస్ చేసింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను రాముడితో పోల్చిన నిహారిక.. యుద్ధం గెలిచారు అంటూ..
Niharika , Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2024 | 6:43 PM

మెగా డాటర్ నిహారిక ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ చిన్నది కెరీర్ బిగినింగ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది.  షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ మీదకు అడుగు పెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత నిహారిక హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. ఆతర్వాత నాన్న కూచి అనే వెబ్ సిరీస్ చేసింది. హ్యపి వెడ్డింగ్ అనే సినిమాలో చేసింది. వీటితో పాటు తమిళ్ లోనూ ఓ సినిమాలో నటించింది. అక్కడ ఒరు నల్లనాళ్ పాత్తు సొల్ఱేన్ అనే సినిమా చేసింది నిహారిక. మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమాలో చిన్న పాత్ర చేసింది. చివరిగా సూర్యకాంతం అనే సినిమాలో కనిపించింది.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

అలాగే పలు టీవీ షోలకు, అలాగే గేమ్ షోలకు హోస్ట్ గాను వ్యవహరించారు నిహారిక. ఇక ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేస్తున్నారు నిహారిక. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆగస్టు 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

ఇదిలా ఉంటే తాజాగా నిహారిక ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబందించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. నేను ఎప్పుడు వచ్చేది నెక్స్ట్ సీజనా.? అని నిహారిక అంటే.. వెంటనే సుడిగాలి సుధీర్ మీకేంటండి.. ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని అన్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్న వీడియోను ప్లే చేశారు. ఆ వీడియో తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలానే ఉండిందేమో అనిపించింది నిహారికా అన్నారు. దాంతో ఇప్పుడు ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ను నిహారిక రాముడితో పోల్చడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.