మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరెంజ్. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇటీవలే మళ్లీ థియేటర్లలో రిలీజైంది. 2010లో మొదటి సారిగా విడుదలైన ఆరెంజ్కు డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ రీ రిలీజ్లో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. అయితే రీ రిలీజ్ సమయంలోనే ఆరెంజ్ సినిమాకు వచ్చిన వసూళ్లను జనసేన పార్టీకి విరాళంగా అందిస్తామని నిర్మాత నాగబాబు ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ అందజేశారు మెగా బ్రదర్. మెగా అభిమానులతో కలిసి పవన్ను కలిసిన నాగబాబు రూ.1.05 కోట్ల చెక్ను పవన్కు అందజేశారు. దీనిపై జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆరెంజ్ మూవీ రెండోసారి విడుదల చేసి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజేష్, ధర్మేంద్ర, ఎస్.కే.ఎన్, శివ చెర్రీ, శ్రీనాథ్, ఉమానాగేంద్ర, శ్రీనాథ్ తదితరులను నాగబాబు, పవన్ అభినందించారు.
ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, ప్రభు, బ్రహ్మానందం, మంజుల తదితరులు ఇతర కీలకపాత్రను పోషించారు. హారీష్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఈ సినిమా పాటలు ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ ఆల్బమ్. ఇక పవన్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఇప్పటికే వినోదయ సీతం రీమేక్ను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్తో బిజీబిజీగా ఉంటున్నాడు.
“ఆరెంజ్” చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన రూ. 1.05 కోట్లు జనసేనకు మద్దతుగా అందజేత
Link : https://t.co/7mNSeX7GuF pic.twitter.com/A4dE9pl6lM
— JanaSena Party (@JanaSenaParty) May 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..