Chiranjeevi: రాజశేఖర్ కూతురి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్‌ .. ఏమన్నారంటే..

యువ హీరో తేజ సజ్జా, రాజశేఖర్‌- జీవితల కూతురు శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన చిత్రం 'అద్భుతం'. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు.

Chiranjeevi: రాజశేఖర్ కూతురి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్‌ .. ఏమన్నారంటే..
Follow us

|

Updated on: Nov 23, 2021 | 7:16 PM

యువ హీరో తేజ సజ్జా, రాజశేఖర్‌- జీవితల కూతురు శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన చిత్రం ‘అద్భుతం’. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. మరో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ స్ర్కీన్‌ప్లే అందించారు. టైమ్‌ ట్రావెలింగ్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఈనెల 19న నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలైంది. విభిన్న కథాంశంతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్ట్‌కు ప్రేమ కథను జోడించిన విధానం సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. కాగా తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ‘అద్భుతం’ చిత్రాన్ని చూశారు. అనంతరం ట్విట్టర్‌ వేదికగా సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘అద్భుతం’ గా ఉంది.. ‘నిన్న రాత్రే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ‘అద్భుతం’ మూవీ చూశాను. ఇది ఒక న్యూ ఎంగేజింగ్‌ నోవెల్‌ చిత్రం. సినిమాలో తేజ సజ్జా, శివానీల నటన ఇంప్రెసివ్‌గా ఉంది. వారికి మంచి భవిష్యత్‌ ఉంది. దర్శక నిర్మాతలు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. చిత్ర బృందానికి కంగ్రాట్స్‌’ అంటూ చిరంజీవి ప్రశంసించారు. కాగా మెగాస్టార్‌ నుంచి ప్రశంసలు రావడంపై ‘అద్భుతం’ సినిమా యూనిట్‌ ఉబ్బితబ్బిబ్బవుతోంది. కాగా మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి, యంగ్‌ హీరో సందీప్‌కిషన్‌ కూడా ఈ సినిమాను వీక్షించారు. సినిమా సూపర్బ్‌గా ఉందంటూ చిత్ర బృందానికి సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు పంపారు.

Also read:

Jayamma Panchayathi: నాని దగ్గరకు సుమ పంచాయితీ.. మొదటి పాటను విడుదల చేసిన నేచురల్ స్టార్..

Pushpa: “పుష్ప-1” ట్రైలర్ కోసం భారీ స్కెచ్ వేసిన సుకుమార్.. రిలీజ్ ఎప్పుడంటే..

Rowan Atkinson : మిస్టర్‌ బీన్‌ మరణించాడంటూ మళ్లీ పుకార్లు.. ఆయన ఏటా ఎలా చనిపోతారని తిప్పికొట్టిన అభిమానులు..