రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు అతడి పనే…!
సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందంటూ గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో.. చెన్నై పోలీసులు టెన్షన్ పడ్డ విషయం తెలిసిందే. గాలింపు అనంతరం అది ఫేక్ కాల్ అని తెలియడంతో..ఆ ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించారు పోలీసులు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందంటూ గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో.. చెన్నై పోలీసులు టెన్షన్ పడ్డ విషయం తెలిసిందే. గాలింపు అనంతరం అది ఫేక్ కాల్ అని తెలియడంతో..ఆ ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించారు పోలీసులు. దీంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. కడలూర్ జిల్లా దగ్గర్లోని నెల్లికుప్పంకు చెందిన ఎనిమిదో తరగతి స్టూడెంట్ ఈ పని చేసినట్లు గుర్తించారు. బాలుడు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదని పోలీసులకు విచారణలో తెలిసింది. మెడికల్ స్టేట్మెంట్స్ పరిశీలించిన అనంతరం అతడిని వదిలిపెట్టారు.
అసలు ఏం జరిగిందంటే..
ఈ గురువారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి 108 నెంబర్కు ఫోన్ చేసి రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి రజనీ ఇంటికి చేరుకున్నారు. అయితే కోవిడ్-19 వ్యాప్తి కారణంగా వారిని ఇంట్లోకి అనుమతించలేదు కుటుంబ సభ్యులు. 10 నిమిషాల పాటు వెయిట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ క్యాబిన్, రజనీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టి..ఏమీ దొరక్క పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆపై విచారణలో వచ్చింది ఫేక్ కాల్ అని నిర్దారించారు.