Hariprriya: పిల్ల జమీందార్ హీరోయిన్ గుర్తుందా? ఆ విలన్‌తో పెళ్లి .. ఇప్పుడెంటిలా గుర్తుపట్టకుండా మారిపోయింది

|

Aug 22, 2024 | 9:53 AM

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభంలో చేసిన సూపర్ హిట్ సినిమాల్లో పిల్ల జమీందార్ ఒకటి. విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో నాని సరసన బింధు మాధవి, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు. బింధు మాధవి మోడ్రన్ గర్ల్ గా మెప్పిస్తే.. అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి సింధు పాత్రలో అద్భుతంగా నటించింది కన్నడ ఇండస్ట్రీకి చెందిన హరిప్రియ.

Hariprriya: పిల్ల జమీందార్ హీరోయిన్ గుర్తుందా? ఆ విలన్‌తో పెళ్లి .. ఇప్పుడెంటిలా గుర్తుపట్టకుండా మారిపోయింది
Actress Hariprriya
Follow us on

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభంలో చేసిన సూపర్ హిట్ సినిమాల్లో పిల్ల జమీందార్ ఒకటి. విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో నాని సరసన బింధు మాధవి, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు. బింధు మాధవి మోడ్రన్ గర్ల్ గా మెప్పిస్తే.. అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి సింధు పాత్రలో అద్భుతంగా నటించింది కన్నడ ఇండస్ట్రీకి చెందిన హరిప్రియ. ఇందులో ఆమె అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. అంతకు ముందు భూమికా చావ్లా భర్త భరత్ ఠాకూర్ నిర్మాతగా వ్యవహరించిన తకిత తకిట సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హరిప్రియ. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత నటించిన పిల్ల జమీందార్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. వరుణ్ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది హరిప్రియ. అలాగే బాలకృష్ణతో కలిసి జై సింహా సినిమాలో తెరను పంచుకుంది. ఇందులో ఆమె పోషించిన మంగ పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే దీని తర్వాత తెలుగు వెండి తెరపై కనిపించలేదీ అందాల తార. అయితే కన్నడ సినిమాలో మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. బెల్ బోటమ్, కురక్షేత్ర, పెట్రోమాక్స్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి కన్నడ ప్రేక్షకుల అభిమానం చూరగొంది.

కన్నడ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోల సరసన నటించింది హరిప్రియ . తన అందం, అభినయానికి గుర్తింపుగా పలు అవార్డులు కూడా గెల్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది హరిప్రియ. ప్రముఖ విలన్, కేజీఎఫ్ నటుడు వశిష్టతో కలిసి ఏడడుగులు వేసింది. నారప్ప, నయీం డైరీస్‌, ఓదెల రైల్వేస్టేషన్ తదితర తెలుగు సినిమాల్లో నూ నటించాడు వశిష్ట. ఇటీవల చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో వచ్చిన ఏవమ్ సినిమాలోనూ ప్రతినాయకుడిగా నటించాడు.

ఇవి కూడా చదవండి

భర్త వశిష్ట సింహాతో హరిప్రియ..

 

పెళ్లయిన తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది హరిప్రియ. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగుప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇటీవలే భర్తతో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ. హరిప్రియ క్రియేషన్స్ పేరుతో షార్ట్ ఫిల్మ్ నిర్మించేందుకు రెడీ అవుతోంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.