Tollywood: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

|

Oct 09, 2024 | 6:59 PM

ఎపుడు.. ఎకాడ.. అంటూ కొత్త బంగారు లోకం మూవీలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన స్వప్న గుర్తుందా.? అదేనండీ.! హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. ఆ సినిమాను.. అందులో ఈమె చేసిన క్యారెక్టర్‌ను మర్చిపోవడం అంత సులభం కాదులెండి..

Tollywood: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా
Tollywood
Follow us on

ఎపుడు.. ఎకాడ.. అంటూ కొత్త బంగారు లోకం మూవీలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన స్వప్న గుర్తుందా.? అదేనండీ.! హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. ఆ సినిమాను.. అందులో ఈమె చేసిన క్యారెక్టర్‌ను మర్చిపోవడం అంత సులభం కాదులెండి.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ చిన్నది.. కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వరుణ్ సందేశ్ హీరోగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయిందన్న విషయం తెలిసిందే. ఈ మూవీ హిట్‌తో చిన్నదాని లైఫ్ మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత పలు చిత్రాలకే పరిమితమయ్యింది ఈ అమ్మడు. అంతేకాదు సినిమా ఛాన్స్‌లు, డబ్బు కోసం చేయకూడదని పని కూడా చేసింది ఈ బ్యూటీ.

వ్యభిచార కూపంలో ఇరుక్కుని ఓ హోటల్‌లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇక ఈ ఘటన నుంచి ఆమె బయటకు రావడానికి చాలానే సమయం పట్టింది. ఆ తర్వాత 2018లో శ్వేత బసు ప్రసాద్.. రోహిత్ మిట్టల్ అనే బిజినెస్‌మెన్ ప్రేమించి పెళ్లాడింది. వీరిద్దరూ ఏడాది గడవకముందే విభేదాలతో విడిపోయారు. అనంతరం బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిన ఈ అమ్మడు.. ఇండియా లాక్ డౌన్, క్రిమినల్ జస్టిక్ లాంటి పలు వెబ్ సిరీస్‌లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్వేతబసు ప్రసాద్.. హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. అప్పట్లో కొత్త బంగారు లోకం సినిమాకు బొద్దుగా, ముద్దుగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బక్కచిక్కి కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి