నందముడి నటసింహం బాలకృష్ణ ,నాగార్జున ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. కుర్రహీరోలతో పోటీపడుతూ.. సినిమాలు చేస్తూ భారీ హిట్స్ అందుకుంటున్నారు. బాలకృష్ణ వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. అలాగే నాగార్జున కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే నాగార్జున, బాలకృష్ణ మధ్య అంతా సరిగ్గా లేదని ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఈ వార్తల్లో వాస్తవమే అంతా అన్నది తెలియదు కానీ ఈ ఇద్దరి మధ్య గ్యాప్ గురించి ఎదో ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది.? అసలు ఇది నిజమేనా .? అన్నది కూడా ప్రశ్నే..
బాలకృష్ణ తన తోటి హీరోలతో కలుస్తూనే ఉంటారు. చిరంజీవి బాలయ్య కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే వెంకటేష్ కూడా ఎవరోతోనూ గొడవలు పెట్టుకున్న దాఖలాలు లేవు. అయితే నాగ్, బాలయ్య మధ్య ఎదో గొడవ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున, బాలకృష్ణ కలిసి నటించారని చాలా మందికీ తెలియకపోవచ్చు. అవును బాలకృష్ణ, నాగరాజును కలిసి ఓ సినిమా చేశారు.
నాగార్జున తండ్రి నాగేశ్వరరావు అంటే బాలయ్యకు చాలా ఇష్టం. బాలయ్య నాగేశ్వరరావును చిన్నాన్న గా భవిస్తూ ఉంటారు. ఈ రిలేషన్ తోనే నాగార్జున, బాలకృష్ణ ఇద్దరూ కలిసి నటించాలని చాలా స్టార్లు అందుకున్నారట. కానీ కమ్యూనికేషన్ బాలేకపోవడంతో ఈ ఇద్దరు నటించలేదట. కానీ ఓ సినిమాలో మాత్రం నాగార్జున, బాలకృష్ణ కలిసి కనిపించారు. ఆ సినిమా పేరు త్రిమూర్తులు. ఈ సినిమాలో బాలకృష్ణ, నాగార్జున కలిసి కనిపించారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ, నాగార్జున గెస్ట్ రోల్ లో కనిపించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది ఈ మూవీ.. ఈ సినిమాలో చిరంజీవి, బాలయ్య, నాగార్జునతోపాటు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, రాధ, భాను ప్రియ, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై విజయ ఇలా చాలామంది గెస్ట్ లుగా కనిపించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలోని ఓ పాటలో ఇలా ఇండస్ట్రీలోని సగం మంది హీరోలు కనిపించడంతో అభిమానులు ఆనందంతో ఈలలు వేశారు. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..