AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Athadu: మహేష్ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం పేరు ఏంటో మీకు తెలుసా..?

2005 లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్కడు సినిమాతో మాస్ హీరో అనిపించుకున్న మహేష్ ఆతర్వాత అతడు సినిమాతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకున్నాడు. అతడు సినిమా థియేటర్స్ కంటే టెలివిజన్ లో భారీ విజయంను అందుకుంది. ఇక ఈ సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో నటించాడు. అతడు సినిమా కేవలం మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా కట్టిపడేసింది.

Athadu: మహేష్ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం పేరు ఏంటో మీకు తెలుసా..?
Athadu
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2023 | 11:51 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు బెస్ట్ మూవీస్ లో ఫస్ట్ రోలో ఉండే సినిమాల్లో అతడు ఒకటి. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ బాబు అప్పటివరకు నటించిన సినిమాల్లో విభిన్నమైన సినిమా ఇది. 2005 లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మహేష్ బాబు నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్కడు సినిమాతో మాస్ హీరో అనిపించుకున్న మహేష్ ఆతర్వాత అతడు సినిమాతో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచేసుకున్నాడు. అతడు సినిమా థియేటర్స్ కంటే టెలివిజన్ లో భారీ విజయంను అందుకుంది. ఇక ఈ సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో నటించాడు. అతడు సినిమా కేవలం మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా కట్టిపడేసింది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు నటనతో పాటు బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మానందం, మహేష్ మధ్యలో వచ్చే సీన్స్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఇదిలా ఉంటే అతడు సినిమాలో బ్రహ్మానందం పేరు ఏంటో తెలుసా..? చాలా మందికి ఈ మూవీలో బ్రహ్మానందం పేరు తెలియకపోవచ్చు..

అతడు సినిమాలో ఎక్కడా బ్రహ్మానందం పేరు చెప్పారు. కానీ ఒక్క సీన్ లో మాత్రం బ్రహ్మానందం పేరు చెప్తారు. మొదటి సారి బ్రహ్మానందం మహేష్ బాబును కలిసి సన్నివేశంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం మహేష్ ను పార్థు అంటూ పరిచయం చేస్తాడు. అప్పడే బ్రహ్మానందంను పేరుపెట్టి పిలుస్తారు ధర్మవరపు. అతడు సినిమాలో బ్రహ్మానందం పేరు కిట్టు. ఆ ఒక్క సీన్ లోనే బ్రహ్మీ పేరు చెప్తారు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే ఆడియన్స్ కదలకుండా చూస్తారు. అంతలా ప్రేక్షకులను మెప్పించింది అతడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో కలిసి ఖలేజా సినిమా చేశారు మహేష్. ఇప్పుడు మూడో సారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా రానుంది. గుంటూరు కారం అనే టైటిల్ తో మహేష్ బాబు నయా మూవీ రానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అతడు సినిమాలో మణిశర్మ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలోని అన్నిపాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.