AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్.. మారుతి కాంబో పై క్రేజీ అప్డేట్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే..

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం సలార్ సినిమా పూర్తైన తర్వాత ప్రభాస్ మారుతి మూవీ పట్టాలెక్కనుందట. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న

Prabhas: ప్రభాస్.. మారుతి కాంబో పై క్రేజీ అప్డేట్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే..
Prabhas Maruthi
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2022 | 3:17 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగు దర్శకులే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం డార్లింగ్‏తో మూవీస్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఇవే కాకుండా సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నాడు ప్రభాస్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం సలార్ సినిమా పూర్తైన తర్వాత ప్రభాస్ మారుతి మూవీ పట్టాలెక్కనుందట. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇక సలార్ పూర్తైన వెంటనే డార్లి్ంగ్..మారుతి మూవీ రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కానుందని..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు… స్క్రిప్ట్ వర్క్‏తో డైరెక్టర్ బిజీగా ఉన్నాడట. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుందని తెలుస్తోంది. ఇటీవలే మ్యాచో హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ మూవీ మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.