AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ చిన్నారులంతా ఇప్పుడు స్టార్స్.. చిన్నవయసులోనే మరణించిన ఆ హీరోయిన్.. ఎవరో తెలుసా..

అందులో రెండో వరుసలో టీచర్ పక్కన సరదాగా కూర్చున్న ఆ అమ్మాయి ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. చిన్న వయసులో స్టార్ డమ్ అందుకుని అంతలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటిస్తూ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అనుమానస్పద స్థితిలో మరణించింది. ఇప్పటికీ ఆమె మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఇంతకీ ఆ చిన్నారులంతా ఎవరో తెలుసా.. ?

Tollywood: ఈ చిన్నారులంతా ఇప్పుడు స్టార్స్.. చిన్నవయసులోనే మరణించిన ఆ హీరోయిన్.. ఎవరో తెలుసా..
Actors
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2024 | 9:27 AM

Share

సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంటాయి. ముఖ్యంగా తారల త్రోబ్యాక్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల కొన్ని నెలలుగా త్రోబ్యాక్ ట్రెండ్ పేరుతో సెలబ్రెటీస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కొందరు నటీనటులకు సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఐదుగురు చిన్నారులు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ నటీనటులు. బీటౌన్ సినీ పరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అందులో రెండో వరుసలో టీచర్ పక్కన సరదాగా కూర్చున్న ఆ అమ్మాయి ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. చిన్న వయసులో స్టార్ డమ్ అందుకుని అంతలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటిస్తూ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అనుమానస్పద స్థితిలో మరణించింది. ఇప్పటికీ ఆమె మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఇంతకీ ఆ చిన్నారులంతా ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం ఆ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు.. నటుడు ఫర్హాన్ అక్తర్, నిర్మాత రితేష్ సిధ్వానీ, రిషి రాయ్, ఆనంద్ సుబయ, దివంగత నటి దివ్య భారతి. ఈ ఫోటోను ప్రముఖ నటుడు శర్మన్ జోషి తన ఇన్ స్టాలో గతంలో షేర్ చేశాడు. అయితే ఇప్పుడు వీరంతా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న నటీనటులే. కానీ చిన్న వయసులోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని.. ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ దివ్య భారతి.. 19 ఏళ్ల వయసులోనే తన ఇంటి బాల్కనీ నుంచి పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో దివ్య భారతి ఒకరు. తెలుగు, తమిళంలో, హిందీ భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ ప్రోడ్యూసర్ సాదిద్ నడియావాలాను వివాహం చేసుకుంది. పెళ్లైన ఏడాదికే దివ్య భారతి ముంబైలోని తన ఇంటి బాల్కానీ నుంచి కిందపడిపోయి మృతి చెందింది. అప్పట్లో ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ దివ్యభారతి అకాల మరణం అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.