Mahesh Babu: సూపర్ స్టార్ సినిమాలో కేజీఎఫ్ స్టార్.. మహేష్‏కు ధీటుగా బాలీవుడ్ స్టార్.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Mahesh Babu: సూపర్ స్టార్ సినిమాలో కేజీఎఫ్ స్టార్.. మహేష్‏కు ధీటుగా బాలీవుడ్ స్టార్.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..
Mahesh Babu
Follow us

|

Updated on: Sep 08, 2021 | 1:13 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మహేష్‏కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల లేదా వచ్చే నెలలో కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట మేక్సర్స్. ఇక సినిమా తర్వాత మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులును పూర్తి చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను అక్టోబర్‏లో పట్టాలెక్కించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తైన తర్వతే త్రివిక్రమ్, మహేష్ సినిమా పట్టాలెక్కనుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంజయ్ దత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటికే కేజీఎఫ్ 2 లో నటించిన సంజయ్ దత్ ఈసారి అంతకు మించి అన్నట్లుగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో రోల్ ఉండబోతుందట. అయితే అటు బాలకృష్ణ నటిస్తోన్న అఖండ చిత్రంలో కూడా సంజయ్ దత్ నటించాల్సి ఉంది. కానీ అనారోగ్య పరిస్థుతల కారణంగా సంజత్ దత్ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు మహేష్.. త్రివిక్రమ్ కాంబోలో వచ్చే ఈ సినిమాలో పవర్ ఫుల్ పొలిటికల్ పర్సన్ పాత్రలో సంజయ్ దత్ నటించనున్నాడట. ఇక ఈ సినిమా టైటిల్ పార్థు అనే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: Daggubati Venkatesh : మరో రీమేక్‌కు రెడీ అవుతున్న సీనియర్ హీరో.. ఈ సారి అజిత్ సినిమాతో రానున్న వెంకీ

Akshay Kumar: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం.. అక్షయ్ కుమార్ తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్ చేసిన నటుడు..