కరణం మల్లేశ్వరి బయోపిక్ లో నటించేది ఆమేనా..?
తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్స్ సీజన్ నడుస్తోన్న సంగతి తెలుస్తోందే. ఈ క్రమంలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది.
తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్స్ సీజన్ నడుస్తోన్న సంగతి తెలుస్తోందే. ఈ క్రమంలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ఇటీవలే ప్రముఖ రచయిత కమ్ నిర్మాత కోన వెంకట్ ప్రకటించారు. సంజనా రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కాగా మూవీలో కరణం మల్లీశ్వరి పాత్రలో తొలుత నిత్యా మేనన్ను అనుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
దీంతో పాత్రకు సరితూగే నటి కోసం అన్వేషణ మొదలెట్టింది మూవీ టీమ్. ఇప్పటికే తాప్సీ, రకుల్ప్రీత్ సింగ్ ల పేర్లు కూడా వినిపించాయి. కానీ వారితో మూవీ యూనిట్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని సమాచారం. తాజాగా బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. భూమి పెడ్నేకర్ ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలదని పేరుంది. భూమితో చిత్రబృందం ఇప్పటికే మంతనాలు జరిపిందట. సినిమాలో నటించేందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నెల 15 నుంచి తెలంగాణలో పరిమితమైన సంఖ్యలో నటీనటులు, టెక్నిషియన్లు పాల్గొని చిత్ర షూటింగ్లు చేసుకోడానికి సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తర్వలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.