అందుకే ట్విట్టర్లో అడుగు పెట్టలేదు : అనుష్క
విమెన్ ఓరియంటెడ్ సినిమాలంటే చాలు..ముందుగా అనుష్కనే గుర్తుకు వస్తుంది. 'అరుంధతి, పంచాక్షరి, 'బాహుబలి, సైజ్ జీరో, భాగమతి సినిమాల్లో ఆమె శక్తివంతమైన పాత్రలు పోషించింది.
విమెన్ ఓరియంటెడ్ సినిమాలంటే చాలు..ముందుగా అనుష్కనే గుర్తుకు వస్తుంది. ‘అరుంధతి, పంచాక్షరి, ‘బాహుబలి, సైజ్ జీరో, భాగమతి సినిమాల్లో ఆమె శక్తివంతమైన పాత్రలు పోషించింది. ఇప్పటికీ టాలీవుడ్లో ఎవరైనా ఫిమేల్ ఓరియంటెడ్ కథలు రాసుకున్నారంటే మొదటిగా గుర్తొచ్చేది అనుష్కనే. అంతలా ఆమె పాత్రల్లో ఒదిగిపోయింది. ఇటీవల అనుష్క కీలక పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ విడుదల కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే, అనుష్క సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టా మాత్రమే వినియోగిస్తోంది. మరి ట్విట్టర్లోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తే.. ఆమె సమాధానం ఏంటో మీరే చదవండి. (తమ్ముని పేరుతో అన్న ప్రభుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు)
“‘నాక్కొంచెం బిడియం ఎక్కువ. సెట్లోకి వెళ్తే అన్నీ మర్చిపోతా గానీ, కొత్తవాళ్లతో అంత త్వరగా కలిసిపోలేను. సినిమాలు లేకపోతే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటా. బయట సోసైటీలో విషయాల గురించి అస్సలు పట్టించుకోను. ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ప్రత్యేక రీజన్స్ లేవు. సమయం పెద్దగా లేకపోవడం వల్లే వాటికి దూరంగా ఉంటున్నా. ఫ్యాన్స్ ట్విట్టర్లోకి రమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నా.. రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. నిజానికి ట్విట్టర్ గురించి నాకు పెద్దగా అవగాహన కూడా లేదు. సమయం దొరికినప్పుడు తప్పకుండా ట్విట్టర్లో చేరతా. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరితో ఎప్పుడూ టచ్లోనే ఉంటా” అంటూ చెప్పుకొచ్చింది అందాల అనుష్క.
Also Read :