Allu Arjun: పుష్పరాజ్ను ఫాలో అవుతున్న న్యూయార్క్ మేయర్.. బన్నీతో కలిసి తగ్గేదే లే అంటూ..
అమెరికాలోని భారతీయ ప్రవాసులు నిర్వహించిన ప్రపంచంలోనే అత్యంత ఇండియా డే పరేడ్కు నాయకత్వం వహించారు అల్లు అర్జున్. తన సతీమణి

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్కు (Allu Arjun) అరుదైన గౌరవం దక్కింది. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ ఐకాన్ స్టార్ ప్రస్తుతం న్యూయార్క్లో సందడి చేస్తున్నారు. అమెరికాలోని భారతీయ ప్రవాసులు నిర్వహించిన ప్రపంచంలోనే అత్యంత ఇండియా డే పరేడ్కు నాయకత్వం వహించారు అల్లు అర్జున్. తన సతీమణి స్నేహతో కలిసి జాతీయ జెండా చేతపట్టుకుని ఇండియా డే పరేడ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇండియా డే పరేడ్ లో గ్రాండ్ మార్షల్గా సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు ఐకాన్ స్టార్.
న్యూయార్క్ మేయర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతను చాలా స్పోర్టివ్ జెంటిల్మెన్. మిస్టర్ ఎరిక్ ఆడమ్స్ ధన్యవాదాలు. తగ్గేదే లే అంటూ మేయర్తో కలిసి పుష్పరాజ్ సిగ్వేచర్ స్టెప్ వేశారు. వీరిద్దరు కలిసి తగ్గేదే లే అంటున్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఏడాది ఆగస్ట్ 15తో భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్లకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ కలిసి 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహ ముఖ్య అతిథిలుగా హజరయ్యారు.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.