Sushanth : అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. సుశాంత్ ఈ సినిమా తో గట్టిగా హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు. సోలో హీరోగానే కాకుండా సెకండ్ హీరోగానూ చేస్తూ వస్తున్నాడు సుశాంత్. చిలసౌ సినిమాతో హిట్ అందుకున్న సుశాంత్.. ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎస్. దర్శన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా కథ ఒక బైక్ చుట్టూ తిరుగుతుందని పోస్టర్స్, టైటిల్ చేస్తే అర్ధమవుతుంది. ఇటీవల సెన్సార్కు వెళ్లిన ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఆగస్టు 27న ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమాగురించి సుశాంత్ మాట్లాడుతూ… ‘చిలసౌ’ కంటే ముందే ఈ కథను చేస్తాను అని చెప్పాను. కానీ మధ్యలో ‘అల వైకుంఠపురములో’ చేశాను. నా కోసం చాలా వెయిట్ చేశారు. ఈ కథకు నిరంజన్ రెడ్డి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఆయన బిజీగా ఉండటం వల్ల అది సెట్స్ మీదకు వెళ్లలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వింటాను అని నిరంజన్ రెడ్డి గారిని నేను అడిగాను. ఈ కథ నాకైతే బాగుంటుందని ఆయన కూడా చెప్పారు. అలా ఈ సినిమా ముందుకు వచ్చింది అని అన్నారు. ఫస్ట్ లాక్డౌన్ మామూలుగా గడిచింది. అయితే జనవరిలో వద్దామని అనుకున్నాం కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయింది. ఆ తరువాత మళ్లీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. అది చాలా కష్టంగా గడిచింది. సినిమా సక్సెస్ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ వర్క్. ఈ సినిమాను దాదాపు 50 మందికి చూపించాం. అందరూ బాగా ఉందని అన్నారు అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :