‘నాకు ఓటీటీలంటే ఇంటరెస్ట్ ఉంది.. త్వరలోనే ఎంట్రీ ఇస్తా’.. క్లారిటీ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో..
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య త్వరలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫిదా కుర్రది సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య త్వరలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫిదా కుర్రది సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే త్వరలో ఈ యంగ్ హీరో డిజిటల్ స్క్రీన్ వైపు అడుగులు వేయనున్నాడని గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే చాలా మంది తారలు డిజిటల్ లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో నాగచైతన్య కూడా ఓటీటీ వైపు చూస్తున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ కొత్త విషయాలను ట్రై చేస్తుంటాను. కానీ సినీ ఫీల్డ్ లో ఓ ఫార్మాట్ ఫాలో అవుతున్నాం కాబట్టి నా మనసులో విషయాలను బయట పెట్టలేకపోతున్నాను. నాకు డిజిటల్ స్క్రీన్ పైన ఇంటరెస్ట్ ఉంది. ఖచ్చితంగా ఓటీటీ ఎంట్రీ ప్లాన్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి త్వరలోనే ఈ అక్కినేని హీరో ఓటీటీ తో పలకరిస్తాడేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Ramanaidu Death Anniversary: మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఆరవ వర్ధంతి నేడు