నటి శ్రీసుధ వ్యవహారంలో మరో ట్విస్ట్
ఎస్ఆర్నగర్ సీఐ మురళీకృష్ణ తన నుంచి లంచం తీసుకున్నారంటూ నటి శ్రీసుధ నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఈరోజు ఫిర్యాదు చేశారు.
Sri Sudha Bhimireddy : ఎస్ఆర్నగర్ సీఐ మురళీకృష్ణ తన నుంచి లంచం తీసుకున్నారంటూ నటి శ్రీసుధ నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఈరోజు ఫిర్యాదు చేశారు. తన నుంచి సీఐ మురళీకృష్ణ డబ్బులు వసూలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్టు నటి శ్రీసుధ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు కోసం సీఐ మురళీకృష్ణ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధారాలతో సహా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు నటి శ్రీసుధ.
కాగా గత కొన్ని రోజులుగా శ్రీసుధ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. శ్యామ్ కే నాయుడుపై ఛీటింగ్ కేసు పెట్టడం సహా, అతడు నకిలీ పత్రాలతో బెయిల్ తెచ్చుకున్నాడంటూ మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు శ్యామ్ కె నాయుడుకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేసింది.
Read More : తొమ్మిదో భర్త చేతిలో భార్య హతం..విచారణలో విస్తుపోయే వాస్తవాలు