NTR : ఎన్టీఆర్ ఆపడం నా వల్ల కాలేదు.. నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్
రాజేంద్ర ప్రసాద్ చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు.. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు హీరో తండ్రి పాత్రలతో మెప్పిస్తున్నారు. ఇప్పటికీ అదే ఎనర్జీ, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు రాజేంద్ర ప్రసాద్
సినియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. తన నటనతో ప్రేక్షకుల చేత నటకిరీటి అని పిలిపించుకున్నారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు.. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు హీరో తండ్రి పాత్రలతో మెప్పిస్తున్నారు. ఇప్పటికీ అదే ఎనర్జీ, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ అందరి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే..
ఇది కూడా చదవండి : దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే
రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రీ కన్నుమూశారు. చిన్నవయసులోనే గాయత్రి కన్నుమూయడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయనను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సినీ సెలబ్రెటీలు చాలా మంది ఆయనను పరామర్శించారు. సినిమా ఇండస్ట్రీలో పని చేసే ప్రతివారికి రాజేంద్ర ప్రసాద్ ఎంతో సన్నిహితంగా ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఆయనను ఎంతో అభిమానిస్తూ ఉంటారు. కాగా రాజేంద్ర ప్రసాద్ కు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి : Devara : ఇదెక్కడి మాస్ రా మావ.! దేవరలో నటించిన ఈమె బయట దుమ్మురేపుతోందిగా..!
రాజేంద్ర ప్రసాద్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. నాన్నకు ప్రేమతో సినిమాలో ఈ ఇద్దరూ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయం పంచుకున్నారు. తారక్ ఎవరు.. పెద్దాయన మనవడు.. అంటే నాకు ఏమవుతాడో అందరికి తెలుసు అని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదు. నాన్నకు ప్రేమతో సినిమా క్లైమాక్స్ లో నేను నవ్వుతూనే చనిపోతాను. ఆ సీన్ లో నటిస్తూ ఎన్టీఆర్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు. అది చూసి మేము చాలా ఎమోషనల్ అయ్యాము. ఎన్టీఆర్ ను ఓదార్చడం మావల్ల కాలేదు.. తారక్ ను ఓదార్చలేక చూస్తూ ఉండిపోయాము. అయ్యో నాన్న నేను ఇక్కడే ఉన్నాగా.. అని చెప్పిన కూడా తారక్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎంతో ఎమోషనల్ అయ్యాడు. మేమిద్దరం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు.. మా రిలేషన్ కూడా అలాంటిదేగా అని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి వైరాల్ గా మారాయి.
Mathu Vadalara 2: రియా దొరికేసిందిరోయ్..! మత్తువదలరా 2 భామ మాములుగా లేదుగా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.