
హీరో సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం మండాడి. జాతీయ అవార్డు గ్రహీత వెట్రి మారన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో తమిళ నటుడు సూరి విలన్ గా నటించనున్నాడు. అదే తమిళ్ వెర్షన్ లో సుహాస్ విలన్ గా నటిస్తుండగా, సూరి హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై తీర ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. ఈ చిత్ర షూటింగులో భాగంగా కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు.
రామనాథ పురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే, యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయాయి.
మండాది సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నాడు. RS ఇన్ఫోటైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. సుహాస్, సూరిలతో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Video – A boat capsized during the shooting of #Soori‘s film #Mandaadi, causing damage to the cameras on board….🫣
– This kind of accident happened while the shooting of this film was taking place at a location called Thundi in Ramanathapuram….🥹
pic.twitter.com/yDjTrLOHT1— Movie Tamil (@_MovieTamil) October 4, 2025
కాగా ఇటీవలే రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు హీరో సుహాస్. అతని భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సుహాస్-లలితలది ప్రేమ వివాహం. ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు కానీ పెద్దలు నో చెప్పేసరికి 2017లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. గతేడాది జనవరిలో సుహాస్ భార్య లలిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్లకు కొడుకు పుట్టాడు. దీంతో సుహాస్ కుటుంబంలో సంతోషం వెల్లివెరిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.