AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సోనూ సూద్‌.. ఎగబడ్డ అభిమానులు

దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రంగాలకు కరోనా లాక్‌డౌన్ నుంచి సడలింపులు వచ్చేశాయి. దీంతో పలు రంగాలు తమ తమ పనులను తిరిగి ప్రారంభించేశాయి.

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సోనూ సూద్‌.. ఎగబడ్డ అభిమానులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 28, 2020 | 1:19 PM

Share

Sonu Sood Hyderabad: దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రంగాలకు కరోనా లాక్‌డౌన్ నుంచి సడలింపులు వచ్చేశాయి. దీంతో పలు రంగాలు తమ తమ పనులను తిరిగి ప్రారంభించేశాయి. ఇక సినిమా షూటింగ్‌లకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడంతో.. నిదానంగా ఒక్కో సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోన్న నటీనటులకు ఒక్కొక్కరు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. తాజాగా సోనూ సూద్‌ హైదరాబాద్ వచ్చారు.

ఎయిర్‌పోర్ట్‌లోకి ఆయన దిగగానే అభిమానులు పోటెత్తారు. సోనూ మాస్క్‌ ధరించినప్పటికీ, అతడిని గుర్తించిన వారు ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇక వారిని ఏ మాత్రం నిరాశకు గురి అవ్వనీయకుండా సోనూ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్య ఒకటి కాగా.. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న అల్లుడు అదుర్స్‌లో కనిపించనున్నారు.

అయితే కరోనా లాక్‌డౌన్‌ వేళ నటుడు సోనూసూద్ చేసిన సాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లక్షలాది వలస కార్మికులకు ఆయన సాయం చేశారు. కార్మికులను వారి వారి స్వగ్రామాలకు పంపడంతో పాటు మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోనూ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంతో వారి పట్ల దేవుడిగా వెలుగొందిన విషయం తెలిసిందే.

Read More:

శ్రావణి కేసు: ముగిసిన దేవరాజ్‌, సాయికృష్ణల పోలీస్ కస్టడీ

అధికారిక ప్రకటన.. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ