AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవును నాకు కరోనా సోకింది: బుల్లితెర నటుడు‌‌ రవికృష్ణ

తెలుగు సీరియల్స్ రంగంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల సీరియళ్ల షూటింగ్‌లను ప్రారంభించగా..

అవును నాకు  కరోనా సోకింది: బుల్లితెర నటుడు‌‌ రవికృష్ణ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 04, 2020 | 10:09 AM

Share

తెలుగు సీరియల్స్ రంగంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల సీరియళ్ల షూటింగ్‌లను ప్రారంభించగా.. అందులో పాల్గొంటున్న వారు ఒక్కొక్కరుగా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఓ ఐదారు మంది పేరు మోసిన బుల్లితెర నటులకు కరోనా సోకగా.. తాజాగా ‘ఆమె కథ’, ‘వరూధిని పరిణయం’ ఫేమ్, ‘బిగ్‌బాస్‌ 3’ కంటెస్టెంట్‌ రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.

”నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మూడు రోజులుగా నేను ఐసోలేషన్‌లో ఉంటున్నాను. దేవుడి దయ, మీ ఆశీస్సుల వలన ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. ఈ వైరస్‌ ఎక్కడి నుంచి నాకు సోకిందన్న దానిపై నేనేం బాధపడటం లేదు. అయితే నాతో కాంటాక్ట్‌ అయిన వారందరూ పరీక్షలు చేయించుకొని, ఐసోలేషన్‌లో ఉండమని మాత్రం నేను కోరుతున్నా. అలాగే వైరస్ సోకిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించకండని కోరుతున్నా. నెగిటివిటీకి దూరంగా ఉండి, త్వరగా నేను కోలుకోవాలని ఆశిస్తున్నా” అని రవికృష్ణ తెలిపారు. కాగా ఆమె కథలో రవికృష్ణ సరసన నటించే ‘నవ్య స్వామి’కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం