AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె పిచ్చిగా ప్రేమిస్తున్నా.. రానా పట్టించుకోడా..!

రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘విరాట పర్వం 1992’. పీరియాడిక్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఇందులో రానా పోలీస్ పాత్రలో కనిపించనుండగా.. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఈ హీరో. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ చిత్రంలో రానా, సాయి […]

ఆమె పిచ్చిగా ప్రేమిస్తున్నా.. రానా పట్టించుకోడా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 14, 2020 | 3:57 PM

Share

రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘విరాట పర్వం 1992’. పీరియాడిక్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఇందులో రానా పోలీస్ పాత్రలో కనిపించనుండగా.. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఈ హీరో. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ చిత్రంలో రానా, సాయి పల్లవిల మధ్య రెండు వైపుల నుంచి ప్రేమ ఉండదట.

సాయి పల్లవి రానాను పిచ్చిగా ఇష్టపడుతుందట. కానీ రానాకు మాత్రం సాయి పల్లవి మీద ప్రేమ ఉండదట. తన ప్రేమను ఆమె, అతడికి వ్యక్తపరుస్తూనే ఉన్నప్పటికీ.. రానా మాత్రం సాయి పల్లవిపై ప్రేమను చూపించరట. మరి సినిమా మొత్తం ఇలానే ఉంటుందా..? లేక చివర్లోనైనా రానా, సాయి పల్లవిపై ప్రేమను చూపిస్తారా..? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో నందితా దాస్, జరీనా వాహబ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.