Sai Pallavi: రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ముగ్గురిలో ఎవరితో డ్యాన్ చేస్తావ్ ?.. సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..

|

Mar 09, 2023 | 3:13 PM

ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తోన్న హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకం. కంటెంట్.. పాత్ర నచ్చితే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే స్టార్ హీరో సినిమా అయినా సరే సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది.

Sai Pallavi: రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ముగ్గురిలో ఎవరితో డ్యాన్ చేస్తావ్ ?.. సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..
Sai Pallavi
Follow us on

డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది హీరోయిన్ సాయి పల్లవి. తొలి చిత్రంంతోనే నటనతో.. అందంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ… ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తోన్న హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకం. కంటెంట్.. పాత్ర నచ్చితే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే స్టార్ హీరో సినిమా అయినా సరే సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది. గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ.. సంప్రదాయ తెలుగమ్మాయిగా కనిపిస్తూనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇటీవలే తెలుగులో విరాట పర్వం, గార్గి చిత్రాలతో నటించిన ఈ ముద్దుగుమ్మ చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో సినిమాలకు సాయి పల్లవి దూరం కాబోతుందనే టాక్ నడిస్తోంది. అయితే ఈ వార్తలపై సాయిపల్లవి ఇప్పటివరకు స్పందించలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొంది. ఇందులో తన కెరీర్.. తన జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలు.. సినీ విశేషాలను పంచుకున్నారు సాయి పల్లవి. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఈ ముగ్దురిలో ఎవరితో డాన్స్ చేయాలని అనుకుంటున్నావు ? అని ప్రశ్నించగా.. ఆ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

అలాగే సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన మీటూ ఉద్యమం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వేధింపులు అంటే కేవలం శారీరకంగానే కాదని.. మానసికంగానూ ఉంటుందని తెలిపింది. శారీరకంగా వేధింపులకు గురిచేయకపోవచ్చు.. కానీ మీ మాటలతో పక్కవారిని ఇబ్బందిపెట్టినా అది వేధింపులతోనే సమానం అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.