
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ “చిరంజీవ”. ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. నవంబర్ 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
చిరంజీవ మూవీ టీజర్ ఎంటర్ టైన్ మెంట్, లవ్, యాక్షన్ తో ఆకట్టుకుంది. శివ(రాజ్ తరుణ్)కు చిన్నప్పటి నుంచే స్పీడు ఎక్కువ. సైకిల్ ను కూడా జెట్ స్పీడ్ తో నడుపుతుంటాడు. అతని వేగాన్ని చూసినవారు ఆంబులెన్స్ డ్రైవర్ గా చేరమని సలహా ఇస్తారు. అలా ఆంబులెన్స్ డ్రైవర్ అయిన శివ ఒక అందమైన అమ్మాయి (కుషిత కల్లపు)ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత శివ కొన్ని పరిస్థితుల వల్ల సత్తు పైల్వాన్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్ ను నేను లేపేస్తా అని మాటిస్తాడు శివ. శివ తీసుకున్న మిషన్ అసాసిన్ ఏంటి అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. చిరంజీవ సినిమా ఆహా ఓటీటీకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందని టీజర్ తో తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఈ సినిమా నవంబర్ 7 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. టీజర్ తోపాటే ప్రీమియర్ డట్ సైతం అనౌన్స్ చేశారు మేకర్స్. చిరంజీవ మీటర్ లో చాలా మేటర్ ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవ టీజర్ సినీప్రియులను ఆకట్టుకుంటుంది. కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..