Nani Shyam Singha Roy: సాధారణంగా కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి నాని నటించిన రెండు, మూడు చిత్రాల ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. కానీ కరోనా రావడంతో ఈ స్పీడు హీరోకు బ్రేకులు పడ్డాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓటీటీలో ‘వి’తో అభిమానుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్యన మళ్లీ షూటింగ్లు ప్రారంభం అవుతుండటంతో నాని కూడా సెట్స్ మీదకు వెళ్లారు. ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ పూర్తైన తరువాత నాని, శ్యామ్సింగరాయ్లో నటించనున్నారు.
టాక్సావాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా ఇందులో ఓ హీరోయిన్గా సాయి పల్లవి ఫిక్స్ అయినట్లు సమాచారం. కాగా కథానుగుణంగా ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లకు కూడా అవకాశం ఉందట. అందులో భాగంగా ఓ హీరోయిన్ పాత్రకు అనుపమను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరపడం, అనుపమ ఒప్పుకోవడం జరిగిపోయాయని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే నాని, అనుపమ రెండోసారి కలిసి నటించనున్నారు. ఇంతకుముందు ఈ ఇద్దరు కృష్ణార్జున యుద్ధంలో నటించిన విషయం తెలిసిందే.
Read More:
చేతబడి నెపం.. 80 ఏళ్ల వృద్ధుడిని సజీవ సమాధి చేసిన బంధువులు
Sushant Case: ఆ గ్లాస్ ఎందుకు భద్రపర్చలేదు: స్వామి అనుమానాలు