Jathiya Rahadari Movie Update: ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయిన ‘జాతీయ రహదారి’..

నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మల పల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'జాతీయ రహదారి'. ఈ చిత్రంలో మధుచిట్టి,

Jathiya Rahadari Movie Update: ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయిన 'జాతీయ రహదారి'..
Follow us

|

Updated on: Feb 08, 2021 | 8:04 AM

నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మల పల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘జాతీయ రహదారి’. ఈ చిత్రంలో మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫీల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత అంబికా కృష్ణ జాతీయ రహదారి చిత్ర దర్శకుడు, నిర్మాతలకు అభినందనలకు తెలిపారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ.. “రామ సత్యనారాయణ ధైర్యంగా వంద సినిమాలు పూర్తిచేసుకొని 101వ సినిమాగా జాతీయ రహదారితో మీ ముందుకు వస్తుండటం అభినందించాల్సిన విషయం.

ఈ సినిమాకు నరసింహనంది లాంటి దర్శకుడిని సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. నరసింహ నంది తీసిన మూడు సినిమాలు 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. అలాంటి డైరెక్టర్‏ను సెలక్ట్ చేసుకోని జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో ఈరోజు వరకు మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే తమిళంలో సూర్య నటించిన ఆకాశమే హద్దు రా, మలయాళం లో తీసిన జల్లికట్టు సినిమాలు ఆస్కార్ అవార్డులకు వెళుతున్నట్టు తెలిసింది. అయితే ఆ సినిమాలు వెళ్లినట్లు మన తెలుగు సినిమా ఆ స్థాయికు ఎందుకు వెళ్లడం లేదో నాకు అర్థం కావడం లేదు. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు,ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఆ దిశగా అడుగులు వేసేలా శ్రమ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహ నంది దర్శకత్వంలో రామ సత్యనారాయణ గారు తీస్తున్న 101వ “జాతీయ రహదారి” సినిమా అద్భుతమైన అవార్డులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు.

Also Read:

మరోసారి టైగర్‏గా రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. సమ్మర్‏లో షూటింగ్ స్టార్ట్..