మా మూవీని పాక్లో విడుదల చేయం
Riteish Deshmukhతాను ప్రధాన పాత్రలో నటిస్తున్న టోటల్ ధమాల్ చిత్రాన్ని పాకిస్థాన్లో విడుదల చేయనని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అన్నారు. పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన అజయ్.. తన తదుపరి చిత్రాన్ని అక్కడ విడుదల చేయనని ప్రకటించారు. In light of the current situation the team of Total Dhamaal has decided to not release the film in Pakistan. — Ajay Devgn (@ajaydevgn) February […]
Riteish Deshmukhతాను ప్రధాన పాత్రలో నటిస్తున్న టోటల్ ధమాల్ చిత్రాన్ని పాకిస్థాన్లో విడుదల చేయనని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అన్నారు. పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన అజయ్.. తన తదుపరి చిత్రాన్ని అక్కడ విడుదల చేయనని ప్రకటించారు.
In light of the current situation the team of Total Dhamaal has decided to not release the film in Pakistan.
— Ajay Devgn (@ajaydevgn) February 18, 2019
ఈ నిర్ణయంపై అజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశం కంటే ఎవ్వరూ గొప్ప కాదు అని నిరూపించారు సర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా టోటల్ ధమాల్ చిత్ర బృందం అమరవీరుల కుటుంబాలకు 50లక్షలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇంద్రకుమార్ దర్శకత్వం వహించిన టోటల్ ధమాల్ మూవీ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేశ్ దేశ్ముఖ్, అర్షద్ వార్సి, ఈషా గుప్తా, బొమాన్ ఇరానీ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.