AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియా తరపున ‘గల్లీ బాయ్’.. ఆస్కార్ గెలుస్తాడా.?

2020 ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం తరపున బాలీవుడ్ మూవీ ‘గల్లీ బాయ్’ నామినేట్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే గాక 2019 బ్లాక్‌బస్టర్ హిట్స్ జాబితాలో టాప్ 10లో నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా ఆస్కార్ 2020కి ఎంపిక […]

ఇండియా తరపున 'గల్లీ బాయ్'.. ఆస్కార్ గెలుస్తాడా.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 22, 2019 | 2:11 PM

Share

2020 ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం తరపున బాలీవుడ్ మూవీ ‘గల్లీ బాయ్’ నామినేట్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే గాక 2019 బ్లాక్‌బస్టర్ హిట్స్ జాబితాలో టాప్ 10లో నిలిచింది.

ఇక తాజాగా ఈ సినిమా ఆస్కార్ 2020కి ఎంపిక కావడం విశేషం. మొత్తానికి 27 చిత్రాలతో పోటీపడి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఇండియా తరపు నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాత ఫరాన్ అక్తర్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియజేశారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) పోటీపడుతున్న మొత్తం 28 చిత్రాలను పరిశీలించిన తర్వాత ‘గల్లీ బాయ్’ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇక ఈ ఏడాది ఆస్కార్ ఇండియా జూరీ కమిటీకి అపర్ణాసేన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ‘గల్లీ బాయ్’ సినిమాకు క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ముంబైలోని ఒక గల్లీ కుర్రాడు ఎలా ర్యాపర్‌గా ఎదిగాడు అనేది ఈ కథాంశం. రియాలిటీకి దగ్గరగా ఉండేలా దర్శకురాలు జోయా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. విమర్శకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ కూడా ఈ మూవీకి వందకు వంద మార్కులు వేశారు. కాగా 92వ అకాడెమీ(ఆస్కార్) అవార్డుల్లో గల్లీ బాయ్ ఆస్కార్‌ను గెలుచుకుంటుందా  లేదా? అనేది వేచి చూడాలి.