AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీనే వదిలేసింది.. కట్ చేస్తే.. రూ.50 వేల కోట్లకు యజమాని ఈ హీరోయిన్..

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. కొందరు ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోతే.. మరికొందరు మాత్రం తక్కువ సమయంలోనే ఫేడౌట్ అయిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం ఒక్క సినిమా చేసి ఊహించని విధంగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.

Tollywood: ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీనే వదిలేసింది.. కట్ చేస్తే.. రూ.50 వేల కోట్లకు యజమాని ఈ హీరోయిన్..
Gayathri Joshi
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2025 | 11:00 AM

Share

సినిమా పరిశ్రమలో అనేక హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే కొందరు సినిమాను వదిలేశారు. కానీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఊహించని రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ఓ హీరోయిన్ అనుహ్యంగా సినీరంగాన్ని వదిలేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు రూ.50 వేల కోట్లకు మహారాణి. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ గాయత్రి జోషి. మోడల్, వీడియో జాకీ అయిన గాయత్రి మొదటి సినిమా ఏకంగా షారుఖ్ ఖాన్ సరసన నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన స్వదేశ్ చిత్రం 2004లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించగా.. ఈ చిత్రం షారుఖ్ ఖాన్ కెరీర్‌లో అత్యుత్తమ సినిమాగా నిలిచింది.

ఇందులో కథానాయికగా నటించిన గాయత్రి జోషి మాత్రం చాలా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిన గాయత్రి.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ ఫస్ట్ మూవీ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది గాయత్రి. ఈ సినిమా విడుదలైన కొన్ని వారాలకే ఆమె చిత్రపరిశ్రమను విడిచిపెట్టి భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అతడే బిజినెస్ మ్యాన్ వికాస్ ఒబెరాయ్. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. ‘స్వదేశ్’ చిత్రం గాయత్రి తన సినీ జీవితంలో ఏకైక చిత్రంగా నిలిచింది.

వికాస్ ఒబెరాయ్.. భారతదేశంలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్త. అతడు రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఒబెరాయ్ కన్స్రక్షన్ కంపెనీకి ఓనర్. నివేదిక ప్రకారం ఆయన ఆస్తులు రూ.50 వేల కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. గాయత్రి కుటుంబం దేశంలోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటి. ప్రస్తుతం గాయత్రి సైతం భర్తతో కలిసి వ్యాపారాన్ని చూసుకుంటుంది.

గాయత్రి జోషి ఫోటో.. 

Gayathri Joshi Movie

Gayathri Joshi Movie