రాజకీయానికి కేరాఫ్ మారిన గూగుల్ డేటా సెంటర్
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను అదానీ సంస్థ చూసుకుంటుందని గూగుల్ లేఖ రాయడంతో సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, అదానీకి వేల కోట్ల రాయితీలు, విలువైన భూములు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని సిపిఎం ఆరోపిస్తోంది.
విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వ్యవహారం ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను అదానీ సంస్థ చూసుకుంటుందని గూగుల్ రాసిన లేఖపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 1,36,000 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఒప్పందం జరిగింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం అదానీ కంపెనీతో సమన్వయం చేసుకోవాలని గూగుల్ తన లేఖలో కోరింది. భూ యాజమాన్య హక్కులతోపాటు నిర్వహణను అదానీ కంపెనీకి అప్పగించాలన్న గూగుల్ ప్రతిపాదనలపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
MLA అరవ శ్రీధర్ – వీణ ఎపిసోడ్ లో కీలక పరిణామం
Botsa Satyanarayana: కూటమి వచ్చాక.. ఒక్క కొత్త పెన్షనూ లేదు
మల్లారెడ్డి యూనివర్సిటీలో శివరాత్రి జాగరణ కార్యక్రమం
బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు
'ఖమేనీ'మృతితో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశం
ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే
కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల..
ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం
భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

