AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botsa Satyanarayana: కూటమి వచ్చాక.. ఒక్క కొత్త పెన్షనూ లేదు

Botsa Satyanarayana: కూటమి వచ్చాక.. ఒక్క కొత్త పెన్షనూ లేదు

Phani CH
|

Updated on: Feb 13, 2026 | 12:40 PM

Share

శాసనమండలిలో బొత్స సత్యనారాయణ భూముల కేటాయింపులు, పెన్షన్లు, అమ్మఒడి పథకంపై ప్రశ్నలు లేవనెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, ముఖ్యమంత్రి కుటుంబం విశాఖలో వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా పొందడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమ్మఒడి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు. అర్హులైన వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా, విశాఖపట్నంలో భూముల కేటాయింపుల్లో పారదర్శకత లేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం 54 వేల ఎకరాల భూమిని, సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మల్లారెడ్డి యూనివర్సిటీలో శివరాత్రి జాగరణ కార్యక్రమం

Lok Sabha: లోక్ సభ లో.. జగడ జగడ జగడం

విడిపోయాకే సంతోషంగా ఉన్నా.. బాధ లేని బంధం

టాలీవుడ్‌లో ఆ సినిమాలకు కష్ట కాలం.. పాపం

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్