AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా మూవీకి సాయి పల్లవి ఓ అస్సెట్.. దర్శకుడి ప్రశంసలు..!

తన మూవీకి సాయి పల్లవి ఓ అస్సెట్ అంటూ కితాబిచ్చారు ఓ యువ దర్శకుడు. తన సినిమాలో హీరోయిన్‌ పాత్రను రాసుకున్నప్పుడే సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నానని..

నా మూవీకి సాయి పల్లవి ఓ అస్సెట్.. దర్శకుడి ప్రశంసలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 3:41 PM

Share

తన మూవీకి సాయి పల్లవి ఓ అస్సెట్ అంటూ కితాబిచ్చారు ఓ యువ దర్శకుడు. తన సినిమాలో హీరోయిన్‌ పాత్రను రాసుకున్నప్పుడే సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నానని.. ఇందులో పల్లవి అద్భుతంగా నటించిందంటూ ప్రశంసించారు. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే వేణు ఊడుగుల. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం రానాతో ‘విరాట పర్వం’ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు క్లైమాక్స్‌కు రాగా.. విరాట పర్వం గురించి పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.

ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ”ప్రేమమ్‌లో సాయి పల్లవి నటన నాకు చాలా నచ్చింది. సాయి పల్లవి మొదటి సినిమా సమయంలోనే నేను ఆమెను సంప్రదించాను. కానీ బిజీగా ఉండటం వలన అప్పుడు కుదరలేదు. ‘విరాట పర్వం’లో హీరోయిన్‌ పాత్రకు సాయి పల్లవినే న్యాయం చేయగలదని నేను భావించాను. దీంతో ఆమెను కలిసి కథ వినిపించాను. వెంటనే ఇందులో నటించేందుకు సాయి పల్లవి ఒప్పుకుంది. విరాట పర్వం సినిమాకు సాయి పల్లవి ఓ అస్సెట్” అని అన్నారు.

కాగా నక్సలిజం నేపథ్యంలో ‘విరాట పర్వం’ తెరకెక్కుతోంది. ఇందులో రానా సరసన సాయి పల్లవి నటిస్తుండగా.. ప్రియమణి, నందితా దాస్‌, జరీనా వాహిబ్‌, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: నిరాకరించిన 8 ఆసుపత్రులు.. అంబులెన్స్‌లో గర్భిణి మృతి..!