కరోనా బారిన పడ్డ ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు

టాలీవుడ్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. అటు షూటింగ్‌ల్లో పాల్గొంటున్న సీరియల్‌ నటీనటులతో పాటు.. ఇటు ఇంట్లో ఉన్న వారికి సైతం కరోనా సోకుతోంది.

కరోనా బారిన పడ్డ ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు

Edited By:

Updated on: Aug 13, 2020 | 7:05 AM

Director tests positive for Corona: టాలీవుడ్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. అటు షూటింగ్‌ల్లో పాల్గొంటున్న సీరియల్‌ నటీనటులతో పాటు.. ఇటు ఇంట్లో ఉన్న వారికి సైతం కరోనా సోకుతోంది. తాజాగా మరో దర్శకుడు ఈ వైరస్ బారిన పడ్డారు. ఆర్‌ఎక్స్‌ 100తో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకుంటానని, ప్లాస్మా దానం కూడా చేస్తానని అజయ్‌ వెల్లడించారు.

కాగా ఈ దర్శకుడు ‘మహా సముద్రం’ను తెరకెక్కించనున్నారు. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా నటించనున్నారు. అలాగే తాను మహా సముద్రంలో నటిస్తున్నానని సాయి పల్లవి సైతం క్లారిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు రానప్పటికీ, కరోనా పరిస్థితులు కాస్త సర్దుకున్న తరువాత మహా సముద్రం సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

Read This Story Also: ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమం.. గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయి