
ప్రభాస్ను ఆ బాలీవుడ్ దర్శకుడు కావాలనే టార్గెట్ చేస్తున్నారా..? ఆయన సినిమా వచ్చిన ప్రతీసారి.. తన సినిమాను కూడా కావాలనే అదే తేదీకి తీసుకొస్తున్నారా..? ఆల్రెడీ ఒకేసారి ప్రభాస్ సినిమాను దారుణంగా దెబ్బ తీసిన ఆ దర్శకుడు.. ఇప్పుడు సలార్ను లక్ష్యంగా చేసుకుంటున్నారా..? అసలు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు.. ఇంతకీ ఎవరా దర్శకుడు.. ఎందుకలా చేస్తున్నారు.. ఈ స్టోరీలో చూసేద్దాం పదండి..!
అక్కడ పాటలో రజినీకాంత్ క్రేజ్ను ప్రభాస్ ఎలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారో.. ఇప్పుడు ప్రభాస్ను కూడా అలాగే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియన్ వైడ్గా రెబల్ స్టార్కు అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిప్పుడు. ఈయన సినిమాలకు పోటీగా రావడానికి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు మేకర్స్. కానీ బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం అదేంటో ప్రతీసారి ప్రభాస్నే టార్గెట్ చేస్తున్నారు.
గతేడాది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి పేరు మార్మోగిపోయింది. చిన్న సినిమాగా విడుదలై 250 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. 2022 మార్చ్ 11 అంటే.. ప్రభాస్ రాధే శ్యామ్ విడుదలైన రోజే కాశ్మీర్ ఫైల్స్ కూడా వచ్చింది. ఓపెనింగ్స్ రాధే శ్యామ్కు వచ్చినా.. ఆ తర్వాత మాత్రం కాశ్మీర్ ఫైల్స్ ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు సలార్కు పోటీగా.. తన వాక్సిన్ వార్ తీసుకొస్తున్నారు వివేక్.
సలార్ విడుదలవుతున్న సెప్టెంబర్ 28నే వివేక్ అగ్రిహోత్రి వాక్సిన్ వార్ వస్తుంది. ఇదిలా ఉంటే ఆదిపురుష్పైనా విరుచుకుపడ్డారు ఈ దర్శకుడు. ఎవర్ని పడితే వాళ్లను దేవుడంటే నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కారని.. తన దృష్టిలో ఆదిపురుష్ నాన్సెన్స్ అన్నారు వివేక్ అగ్నిహోత్రి. మొత్తానికి ఈయన తీరు చూస్తుంటే ప్రభాస్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సలార్ హిట్టైతే తప్ప.. వివేక్ నోటికి తాళం పడదేమో..?
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..